Breaking News

ఢిల్లీకి సీఎం..మంత్రులతో వరుస సమావేశాలు


Published on: 18 Dec 2025 17:47  IST

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు (శుక్రవారం) ఆరుగురు కేంద్రమంత్రులతో సీఎం సమావేశంకానున్నా రు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.శుక్రవారం ఆరుగురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతారు.కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై చర్చిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి