Breaking News

ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా గంజాయి సరఫరా..


Published on: 19 Dec 2025 15:03  IST

రాష్ట్రంలో గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు పోలీసులు అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. గంజాయిని అమ్ముతున్నా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడో చోట గంజాయి సరఫరా జరుగుతూ పట్టుబడటం పోలీసులకు సవాల్‌గా మారింది. తాజాగా రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి