Breaking News

తన ఇంటిని తాకట్టు పెట్టిన హరీశ్‌రావు


Published on: 19 Dec 2025 16:25  IST

పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య కోసం మాజీ మంత్రి హరీశ్‌రావు ఏకంగా తన ఇంటినే తాకట్టు పెట్టారు. సిద్దిపేటలోని తన స్వగృహాన్ని బ్యాంకులో తనఖా పెట్టి మమత అనే అమ్మాయికి రూ.20లక్షల ఎడ్యుకేషన్‌ లోన్‌ మంజూరు చేయించారు. అలాగే హాస్టల్‌ ఫీజు కోసం లక్ష రూపాయలు కూడా అందజేశారు. గతంలో మమత ఎంబీబీఎస్‌ చదువు కోసం హరీశ్‌రావునే సాయం చేశారు. అంతేకాకుండా ఆమె ముగ్గురు తోబుట్టువుల ఎంబీబీఎస్‌ చదువు కోసం కూడా హరీశ్‌రావునే సాయం చేయడం గమనార్హం.

Follow us on , &

ఇవీ చదవండి