Breaking News

జనావాసాల్లోకి ప్రవేశించిన చిరుత..


Published on: 19 Dec 2025 17:03  IST

అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు, క్రూర జంతువులు ఇటీవలే కాలంలో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర (Maharashtra)లో చిరుత (Leopard) కలకలం రేపింది. థానే (Thane) జిల్లాలోని జనసాంద్రత ఎక్కువగా ఉన్న తూర్పు భయందర్‌ (Bahyandar) ప్రాంతంలోకి ప్రవేశించింది. శుక్రవారం ఉదయం ఓ భవనంలోకి ప్రవేశించి భయాందోళన సృష్టించింది. స్థానికులపై దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి