Breaking News

మంచు కమ్ముతోంది.. చలి చంపుతోంది!


Published on: 23 Dec 2025 12:50  IST

జిల్లాలో పట్టణాలు, పల్లెలపై పొగమంచు కమ్ముతోంది. ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. ఉదయాన్నే బయటకు రావాలంటే భయపడుతున్నారు. శీతల వాతావరణంలో వైరస్‌లు, బ్యాక్టీరియాలు విజృంభించి పలురకాల వ్యాధుల బారినపడుతున్నారు. బాపట్ల, చీరాల ప్రాంతీయ ఆసుపత్రులు, రేపల్లె, అద్దంకి, పర్చూరు సామాజిక ఆసుపత్రుల్లో ఔట్‌పేషెంట్‌ విభాగానికి అనారోగ్యంతో వచ్చే వారి సంఖ్య పెరిగింది. మంచులో సాధ్యమైనంత వరకు బయట తిరగకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి