Breaking News

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు 6.23లక్షల విద్యార్థులు..


Published on: 23 Dec 2025 17:35  IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ కూడా విడుదల చేసింది. ఇక ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరు కానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ఇప్పటికే వచ్చిన పరీక్ష ఫీజు చెల్లింపులు, నామినల్‌ రోల్‌ ఆధారంగా మొత్తం విద్యార్దులు సంఖ్యను తెలిపింది. 

Follow us on , &

ఇవీ చదవండి