Breaking News

సుపరిపాలన యాత్రకు విశేష స్పందన


Published on: 24 Dec 2025 12:17  IST

అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో వాజ్‌పేయి విగ్రహాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. నేటి తరానికి వాజ్‌పేయి విలువలు ఆదర్శమని అన్నారు. వాజ్‌పేయి గొప్పతనం తెలుసుకుని అందరూ ఆశ్చర్యవ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సుపరిపాలన యాత్ర గురించి సీఎం చంద్రబాబుకు చెప్పిన వెంటనే ఆనందం వెలిబుచ్చారని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి