Breaking News

చల్లారిన ఉద్రిక్తతలు..32 విమానాశ్రయాలు రీఓపెన్‌


Published on: 12 May 2025 14:08  IST

భారత్‌-పాక్‌  నడుమ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారత్‌లోని 32 విమానాశ్రయాలను మే 15 వరకు మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తొలగిపోవడంతో విమానాశ్రయాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తొలుత ఈనెల 15 వరకు వాటిని మూసివేయాలని భావించినప్పటికీ పరిస్థితులు మెరుగుపడటంతో వాటిని తెరిచినట్లు అధికారులు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి