Breaking News

ఢిల్లీలో పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు


Published on: 12 May 2025 15:57  IST

దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఢిల్లీ లో ఏర్పాటు చేయనున్నారు. పీవీ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్  కీలక ఆమోదం తెలిపింది. ఇక కేంద్రం నిర్ణయమే తరువాయిగా మారింది.ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. తెలంగాణ భవన్‌లో పీవీ విగ్రహం ఏర్పాటుకు న్యూఢిల్లీ మున్సిపల్  కార్పొరేషన్  ప్రతిపాదన చేసింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి