Breaking News

ఎంపీ ఈటల రాజేందర్‌పై మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు


Published on: 12 May 2025 16:45  IST

మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దిగజారి మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఈటల రాజేందర్ వాడిన బాష చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. ఇవాళ(సోమవారం) గాంధీభవన్‌లో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఈటల రాజేందర్‌కు పదవి రాకుండా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అడ్డుపడుతుంటే ఆ ఫ్రస్టేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డిపై ఈటల రాజేందర్ చూపిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి