Breaking News

జూనియర్‌ కాలేజీల్లోని గెస్ట్ లెక్చరర్లకు గుడ్‌న్యూస్‌..


Published on: 13 May 2025 14:54  IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్‌లకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచుతున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం గంటకు ఇస్తున్న రూ.150 పారితోషికాన్ని రూ.375కు పెంచడం జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి