Breaking News

రాష్ట్రపతితో సీడీఎస్, త్రివిధ దళాధిపతుల భేటీ


Published on: 14 May 2025 16:00  IST

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో రాష్ట్రపతి భవన్‌లో ఆర్మీ ఉన్నతాధికారులు కలిసిన ఫోటోను రాష్ట్రపతి ముర్ము షేర్ చేశారు. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి తనను కలుసుకున్నారని ఈ పోస్ట్‌లో రాష్ట్రపతి తెలిపారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను తెలియజేశారని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు పోరాడిన తీరును రాష్ట్రపతి ఈ సందర్భంగా అభినందించారు.

Follow us on , &

ఇవీ చదవండి