Breaking News

ఐదో రోజు శ్రీధర్‌ను విచారిస్తున్న ఏసీబీ


Published on: 24 Jun 2025 16:16  IST

అక్రమాస్తుల కేసులో చివరి రోజు మంగళవారం నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్‌ను కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. కోర్టు అనుమతితో మరోసారి శ్రీధర్‌ను కస్టడీకి తీసుకునే ఆలోచనలో ఏసీబీ అధికారులు ఉన్నారు.విచారణలో శ్రీధర్ అక్రమంగా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. బ్యాంకు లాకర్లలో స్వాధీనం చేసుకున్న ఆస్తులు విలువ సుమారు రూ. 5 కోట్లు పైనే ఉంటుందని అంచనా వేశారు.

Follow us on , &

ఇవీ చదవండి