Breaking News

సబితా ఇంద్రారెడ్డిని విమర్శిస్తే ఊరుకోం..?


Published on: 24 Jun 2025 18:26  IST

కాంగ్రెస్ నాయకులు తమ స్థాయిని మర్చిపోయి మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ మహేశ్వరం మండల అధ్యక్షుడు రాజు నాయక్, మర్యాద రాఘవేందర్ రెడ్డి, శంకరయ్య తదితరులు ధ్వజమెత్తారు. మహేశ్వరం మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాఘవేందర్ రెడ్డి, శంకరయ్య తోపాటు 200 మంది కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి