Breaking News

పనులు చేయకుండానే బిల్లులు స్వాహా..!


Published on: 24 Jun 2025 18:22  IST

వరద నీటి కాలువ ఆధునీకరణ పనులు చేయకుండానే… చేసినట్లుగా దొంగ రికార్డులు సృష్టించి బిల్లులను స్వాహా చేసేందుకు జిహెచ్ఎంసి అధికారులు, కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారు. తూతూ మంత్రంగా పనులు చేసినట్లు చూపించి మొత్తం బిల్లులను కాజేసే కుట్రకు తెరలేపారు. ఐఎస్ సదన్ డివిజన్‌లో ఇంజినీరింగ్ అధికారుల అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. నెలరోజుల క్రితం రూ. 10 లక్షలు స్వాహా చేసిన విషయం మర్చిపోకముందే, మళ్లీ అదే తరహా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి