Breaking News

నాలుగు రోజులు వానలే.. హెచ్చరించిన వాతావరణశాఖ


Published on: 24 Jun 2025 18:47  IST

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని.. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో వర్షాలు పడుతాయని పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగితాల్య, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి