Breaking News

వరంగల్‌ తూర్పు కోటలో యువకుల మధ్య ఘర్షణ


Published on: 28 Oct 2025 16:13  IST

వరంగల్ తూర్పు కోట ప్రాంతంలో మద్యం మత్తులో యువకుల మధ్య జరిగిన ఘర్షణ దుర్ఘటనగా మారింది. కొమట్ల బండ వద్ద జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడ్డ సంగరబోయిన సాయి (24) చికిత్స పొందుతూ మరణించాడు. స్నేహితుల మధ్య చిన్నపాటి వివాదం పెద్దదై, స్థానిక యువకులు కలిసి సాయిపై దాడి చేసినట్లు సమాచారం. ఘటనపై మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి