Breaking News

సౌదీలో రోడ్డు ప్రమాదం..సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..


Published on: 17 Nov 2025 17:28  IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న ప్రమాదం చాలా బాధకలిగించిందని అన్నారు. మృతుల పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ విషాదకర సమయంలో బాధిత కుటుంబాలకు ధైర్యం, ఓదార్పు కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి