Breaking News

సంగారెడ్డి జిల్లా సర్పంచ్ పదవికి లక్షల్లో వేలం!


Published on: 02 Dec 2025 12:29  IST

సంగారెడ్డి జిల్లా, కల్హేర్ మండలం ఖానాపూర్ (కె) గ్రామంలో సర్పంచ్ పదవి కోసం బహిరంగ వేలం జరిగింది. ఎస్టీ (జనరల్) అయిన ఈ పదవి కోసం ఇద్దరు అభ్యర్థులు తలపడ్డారు. బీఆర్ఎస్ మద్దతు పొందిన అభ్యర్థి రూ. 22.20 లక్షలు, బీజేపీ మద్దతున్న అభ్యర్థి రూ. 25 లక్షల వరకు చెల్లించేందుకు సిద్ధమని ప్రకటించారు.ఈ ఖానాపూర్ (కె) గ్రామం మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (భూపాల్ రెడ్డి), ప్రస్తుత ఎమ్మెల్యే టి. విజయ్ పాల్ రెడ్డి స్వగ్రామం కావడం విశేషం.

Follow us on , &

ఇవీ చదవండి