Breaking News

గద్వాల ఎస్టీ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌..


Published on: 02 Dec 2025 14:23  IST

ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటకీ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా గద్వాల ఎస్టీ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. కలుషిత ఆహారం తినడంతో 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది వారిని గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి