Breaking News

సోనియా గాంధీకి రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు..


Published on: 09 Dec 2025 14:53  IST

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీకి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. సోనియా గాంధీ నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు పొందారని ఢిల్లీకి చెందిన న్యాయవాది వికాస్ త్రిపాఠి రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసి సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ కేసులో సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా న్యాయస్థానం సమన్లు జారీ చేసింది ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 6, 2026కు వాయిదా వేశారు.

Follow us on , &

ఇవీ చదవండి