Breaking News

పరకామణి కేసు..హైకోర్టుకు సీఐడీ అదనపు నివేదిక


Published on: 09 Dec 2025 17:16  IST

పరకామణి చోరీ కేసులో లోక్‌ అదాలత్‌ వద్ద రాజీ వ్యవహారంపై హైకోర్టుకు సీఐడీ అదనపు నివేదిక ఇచ్చింది. నిందితుడు రవికుమార్‌ విదేశీ కరెన్సీని చోరీ చేస్తూ అడ్డంగా దొరికిన కేసును లోక్‌ అదాలత్‌ వద్ద రాజీ చేయడంపై హైకోర్టుకు అదనపు నివేదిక సమర్పించింది. అయితే, దీనికి సంబంధించిన మరో 2 సెట్లను సీల్డ్‌ కవర్‌లో రిజిస్ట్రార్‌కు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకోవడం చట్టబద్ధత అవునా, కాదా? అని హైకోర్టు తేల్చనుంది.

Follow us on , &

ఇవీ చదవండి