Breaking News

వారిని ఎవరూ రక్షించలేరు.. కవిత మాస్ వార్నింగ్


Published on: 17 Nov 2025 12:20  IST

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఇవాళ(సోమవారం) ఖమ్మం జిల్లా లోని ఎర్రుపాలెం మండలం జమలాపురంలో కవిత పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి శాతవాహన ఎక్స్‌‌ప్రెస్‌లో మధిరకు నిన్న(ఆదివారం) చేరుకున్నారు. రైల్వే స్టేషన్‌లో కవితకు ఘన స్వాగతం పలికారు.

Follow us on , &

ఇవీ చదవండి