Breaking News

సౌదీ ప్రమాదం..ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం


Published on: 17 Nov 2025 18:55  IST

సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యేతోపాటు మైనార్టీ విభాగానికి చెందిన ఉన్నతాధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపాలనీ కేబినెట్ నిర్ణయించింది.

Follow us on , &

ఇవీ చదవండి